నాపై యుద్దానికి చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు : సీఎం జగన్

-

ప్రత్యర్థులందరూ ఒక్కటై తనపై యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. “టీడీపీ, బీజేపీ, దత్తపుత్రుడు అంతా కలిసి పోయారు. చంద్రబాబుకి శవరాజకీయాలు, కుట్రలు చేయడం అలవాటు. నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా నా చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు. ఒంటరిగా వచ్చే ధైర్యం ఒక్కరికీ కూడా లేదు. మోసాలు చేసే కూటమి మనకు ప్రత్యర్థిగా ఉంది. వారికి నైతిక విలువలు లేవు” అని మండిపడ్డారు సీఎం జగన్.

ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు మాటల్లో విషం ఎలా ఉంటుందో 2014 ఎన్నికల్లో ఏం చెప్పారో మీరే ఒక్కసారి చూడండి.  చంద్రబాబును నమ్మడం అంటే మన పథకాలను మనమే రద్దు చేసుకోవడం అన్నారు. వైఎస్సార్ జిల్లా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నా వెన్నంటే ఉంటారని పేర్కొన్నారు. 2014లో టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రస్తావించారు సీఎం జగన్. చంద్రబాబు అమలుకు కానీ హామీలు ఇస్తూ.. ప్రజలను మోసం చేస్తారని.. అమలు అయ్యే హామీలనే వైసీపీ అమలు చేస్తుందన్నారు జగన్. 

Read more RELATED
Recommended to you

Latest news