వివేకా మరణం పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణం సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు సీఎం జగన్.  మా చిన్నాయన వివేకానందరెడ్డిని ఎవరు చంపారో మీ అందరికీ తెలుసు. బాబాయ్ ని ఎవరు చంపారో.. ఎవరు చంపించారో.. ఆ దేవుడికి.. ఈ ప్రజలకు అందరికీ తెలుసు. కానీ తనపై బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో..? వారి వెనుకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజూ కనిపిస్తూనే ఉంది. చిన్నాన్నను అతి దారుణంగా చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నారు.

వాడిని చంద్రబాబు, అతని ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంటున్నాయి అని ఆరోపించారు.  75 ఏళ్ల బాబును చూడండి.. తన మేనిఫెస్టోలో ఉన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి. ఎన్నికల అయిపోయాక మేనిఫెస్టో ఎక్కడ కనిపించదు. పొరపాటున ప్రజలకు గుర్తుకొస్తే.. చంద్రబాబును కొడతారేమోనని భయం. అందుకే  మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి  చెప్పి మనందరి పార్టీని గెలిపించండి.

Read more RELATED
Recommended to you

Latest news