నువ్ ఏం చేసినా మంచిదే.. ప్రాణం పోయినా కరెంట్ బాయిల దగ్గర మీటర్లు పెట్టం: సీఎం కేసీఆర్

-

ఎనిమిదేళ్లుగా కేంద్రంతో ఏనాడు కొట్లాట పెట్టుకోలేదు. నరేంద్రమోదీ రెండేళ్ల నుంచి పంచాయతీ పెడుతున్నాడు.. బోర్ల దగ్గర కరెంట్ మీటర్లు పెట్టాలని చూస్తున్నాడు.. పేరుకు విద్యుత్ సంస్కరణలు అని మంచి మాటలు చెబుతూ.. ప్రతీ మోటర్ కు మీటర్ పెట్టాలని చూస్తున్నాడని సీఎం కేసీఆర్ విమర్శించారు. నేను నన్ను చంపినా.. మీటర్లు పెట్టం అని చెప్పానని కేసీఆర్ అని అన్నారు. అడ్డగోలు డిజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారు. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తాం అని పెట్టుబడి డబుల్ చేశాడని విమర్శించారు. అడ్డగోలుగా ఎరువుల ధరలు పెంచాడని ఆరోపించాడు. మీరు పండించే ధాన్యం కొనం.. మీ మీద దాడులు చేస్తాం.. వాట్సాప్ మేసేజ్ లు చేస్తాం అంటే కుదరదని అన్నారు. గతంలో చంద్రబాబు కూడా మీటర్లు పెట్టాలని అన్నాడు.. అలా చెప్పే వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు. మా ప్రాణం పోయినా.. నువ్ ఏం చేసినా.. కరెంట్ మీటర్లు పెట్టం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నీ సంస్కరణలు అమలు చేయం అని అన్నారు. నరేంద్ర మోదీ రైతుల వెంబడి పడ్డాడు. లక్షల కోట్లు కుంభ కోణాలు చేసిన వారికి టికెట్లు కొనిచ్చి పిక్నిక్ పంపాడు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలు ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news