Breaking : కర్ణాటక బస్సు యాక్సిడెంట్‌ మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్‌..

-

ఈ రోజు గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ బస్సు కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో మినీ లారీని ఢీకొట్టి అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది హైదరాబాద్‌ వాసులు సజీవదహనమయ్యారు. అయితే.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు కేసీఆర్‌. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు కేసీఆర్‌.

Telangana Assembly polls: Can the Congress-led grand alliance defeat KCR's  TRS?

క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఇస్తున్నట్టు కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావులకు నిర్దేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందకుపోవాలని సూచించారు కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news