టీమిండియా క్రికెట్ టీమ్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

-

టీమిండియా క్రికెట్ టీమ్ నిన్న ఉప్పల్‌ మ్యాచ్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే… హైదరాబాద్ లో జరిగిన మూడవ T-20 మ్యాచ్ లో ఆస్టేలియాపై ఘన విజయం సాధించి (2-1) సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా క్రికెట్ టీమ్ కు ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ వేదికగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ లో, భారత్ ఘన విజయం సాధించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.

ఉత్కంఠభరితంగా సాగిన ఆట లో, క్రీడ స్పూర్తి ని ప్రదర్శిస్తూ క్రికెట్ అభిమానులకు ఉత్సాహాన్ని నింపిన ఇరు జట్ల క్రీడాకారులను సీఎం అభినందించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా, అంతర్జాతీయ క్రీడ ను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించిన, క్రీడా శాఖ మంత్రిని, పోలీస్ అధికారులను, సిబ్బంది ని సీఎం కేసిఆర్ అభినందించారు. ఇండియా అద్భుత విజయం అంటూ అటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు జరిగిన టి.20 మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇండియా అద్భుత ఆట ను ప్రదర్శించి విజయం సాధించడంతో పాటు సిరీస్ కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news