బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను సన్మానించిన సిఎం కేసీఆర్

-

విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఘనంగా సన్మానించి, ఆతిధ్యం ఇచ్చారు. అంతకుముందు పబ్లిక్ గార్డెన్ లో జరిగిన వేడుకల్లో ఘనంగా సన్మానించి, చెరో రూ.2 కోట్ల నగదు బహుమతిని అందించారు. అనంతరం సిఎం కెసిఆర్ వారిని వారి తల్లిదండ్రులను ప్రగతి భవన్ కు ఆహ్వానించి ఆతిద్యం ఇచ్చారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేసారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు.

బాక్సింగ్ క్రీడపట్ల చిన్నతనం నుంచే మక్కువ చూపించడానికి గల కారణాలను, తాను గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమను నిఖత్ జరీన్ ను సిఎం అడిగి తెలుసుకున్నారు. స్వయంగా క్రీడాకారుడైన తన తండ్రి జమీల్ అహ్మద్ తనకు బాల్యం నుంచే అందించిన ప్రేరణ గురించి ప్రోత్సాహం గురించి నిఖత్ సిఎం కు వివరించారు. తాను బాక్సింగ్ లో శిక్షణ పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందని నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక సయంలో అన్ని విధాలా సాయం అందించినందుకు సిఎం కెసిఆర్ కు నిఖత్ జరీన్ ధన్యవాదాలు తెలిపారు.

నిఖత్ పట్టుదలను ఆత్మస్థైర్యాన్ని సిఎం కెసిఆర్ అభినందించారు. తెలంగాణ క్రీడాకారులకు తాను ఎల్లవేళలా అండగా వుంటానని, క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీకంగా మానసికంగా ధృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పుట్టిన తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా, నిఖత్ జరీన్ ఇషా సింగ్ లను చూసి తెలంగాణ యువతీ యువకులు స్పూర్తి పొందాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.గత 2014 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తనకు నగదు బహుమతిగా 50 లక్షల రూపాయల చెక్కును అందిస్తూ, తన అభ్యర్థన మేరకు బాక్సింగ్ ఫోజిచ్చిన గతాన్ని నిఖత్ జరీన్ సిఎం కెసిఆర్ కు గుర్తుచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news