ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు వ‌రాలు ప్ర‌క‌టించ‌నున్న‌ కేసీఆర్‌..

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులతో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్‌ కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో కార్మికులకు శుభవార్త చెబుతారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు కురిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

పగలు మాత్రమే మహిళ ఉద్యోగ, కార్మికులకు డ్యూటీ వేసే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రసూతి సెలవుల పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. బేబీ కేర్ టేకర్ లీవ్‌లు కూడా మంజూరు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా మహిళ కార్మికుల భద్రతపై మానిటరింగ్‌కు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియా మీట్ నిర్వహిస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news