చండూరుకి హెలికాప్టర్ లో చేరుకున్న సీఎం కేసీఆర్.. కాసేపట్లో సభలో ప్రసంగం

-

నేడు మునుగోడు నియోజకవర్గం చండూరులో టిఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభ ప్రారంభం అయింది. ఈ బహిరంగ సభకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఇక ప్రస్తుతం హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చండూరుకు బయలుదేరిన సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

సభ వేదిక మీదికి చేరుకున్న సీఎంం కేసీఆర్.. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాలవేసి.. సభా ప్రాంగణంలో గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వాగత ప్రసంగాన్ని ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news