టీఆర్ఎస్ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ప్రారంభం

-

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్ర‌క‌టించ‌నున్న నేప‌థ్యంలో దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోంది.  మ‌ధ్యాహ్నం 1:19 గంట‌ల‌కు జాతీయ పార్టీ పేరును కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలో వివిధ రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కులు హైద‌రాబాద్ చేరుకుని సీఎంకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన చేరుకోగా, టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభం అయింది.

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ద‌స‌రా పూజ‌ల అనంత‌రం క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి భారీ కాన్వాయ్‌తో కేసీఆర్ పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

ఇక కేసీఆర్ ప్ర‌క‌టించ‌బోయే జాతీయ పార్టీపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. మ‌రికాసేప‌ట్లో జాతీయ పార్టీని కేసీఆర్ ప్ర‌క‌టించ‌బోతుండ‌టంతో.. దేశ‌మంతా తెలంగాణ‌వైపే చూస్తోంది. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తున్న క్ర‌మంలో రాష్ట్ర‌వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంబురాలు జ‌రుపుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news