రేపు సిరిసిల్ల కు సీఎం కేసీఆర్… పర్యటన వివరాలివే…!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల Sirisilla జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇక ఇప్పటికే సిరిసిల్లకు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ కూడా ఏర్పాట్లను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. ఇక సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేసీఆర్… పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు రూ.210 కోట్లతో పూర్తి చేసిన పలు భవన సముదాయాలను సీఎం ప్రారంభించనున్నారు

సిరిసిల్ల/ Sirisilla
సిరిసిల్ల/ Sirisilla

జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలానే సిరిసిల్లలోని నర్సింగ్ కళాశాల నూతన భవనాన్ని, సర్ధాపూర్ లో నిర్మించిన నూతన వ్యవసాయ మార్కెట్ యార్డును, తంగళ్ళపల్లి మండలం మండెపల్లి శివారులోని అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా & పరిశోధనా కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ లో రూ.87 కోట్లతో నిర్మించిన 1320 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళను కూడా సీఎం ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news