కరోనాతో సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు మృతి..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాల్య స్నేహితుడు, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ కమిటి చైర్మెన్ బొమ్మెర వెంకటేశం కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని వాసవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెర వెంకటేశం, కేసీఆర్‌లు బాల్య స్నేహితులు. వీరు 5వ తరగతి వరకు దుబ్బాకలో కలిసి చదువుకున్నారు. ఆయన భార్య పేరు విజయ. అలాగే ఆయనకి నలుగురు కొడుకులు ఉన్నారు.

ఇకపోతే వెంకటేశం రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీగా, చల్లాపూర్ గ్రామ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా, రేకులకుంట మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడిగా పని చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత బొమ్మెరతో సాన్నిహిత్యాన్ని వీడలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను నేరుగా కలిసే స్వేచ్చను కల్పించారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news