గురుకుల పాఠశాలలను మరిన్ని పెంచుతాం – సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

-

గురుకుల పాఠశాలలను మరిన్ని పెంచుతామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. భారీ కాన్వాయ్ తో మహబూబ్ నగర్ పర్యటనకు సీఎం కేసీఆర్.. నూతన కలెక్టరేట్ ను, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, గురుకులాలను ఇంకా పెంచుతాం. చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమాన్ని తెచ్చినం. కంటి వెలుగు ఆషామాషీగా తెచ్చిన కార్యక్రమం కాదని వెల్లడించారు.

కంటి వెలుగు ఓట్ల కోసం పెట్టింది కాదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందే. సంస్కరణ అనేది అంతం కాదన్నారు సీఎం కేసీఆర్‌. పాలమూరులో కొత్త కలెక్టరేట్‌ భవనం ప్రారంభించుకోవడం సంతోష మన్నారు. వేదనలు, రోదనలతో బాధపడ్డ పాలమూరు జిల్లా ఈ రోజు సంతోషంగా ఉంది. ఏ తెలం గాణ కోసం పోరాడామో ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో మనమే భేష్‌ అ ని కొనియాడారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news