మహాప్రస్థానంలో ముగిసిన నటి జమున అంత్యక్రియలు

-

సీనియర్ సీని నటి జమున అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. జమున కుమార్తె స్రవంతి ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వాహించారు. జమున ఇవాళ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 86 ఏళ్ల జమున కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, ఈ సాయంత్రం నగరంలోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో జమున అంత్యక్రియలు నిర్వహించారు. జమునకు కుమార్తె స్రవంతి రావు అంతిమసంస్కారాలు జరిపారు. విదేశాల నుంచి జమున కుమారుడు వచ్చేందుకు సమయం పడుతుండడంతో, కుమార్తె అంత్యక్రియలు నిర్వహించారు.

కాగా, మహాప్రస్థానంలో జమునకు మా అసోసియేషన్ సభ్యులు జీవిత, కరాటే కల్యాణి, మాదాల రవి తదితరులు నివాళులు అర్పించారు. సీనియర్ నటుడు మురళీమోహన్, నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా జమునకు కడసారి వీడ్కోలు పలికారు. ఇక ఏపీ మంత్రి రోజా చివరి నిమిషంలో వచ్చి జమునకు నివాళులు అర్పించారు. టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ జమున కుమార్తె స్రవంతిరావును పరామర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news