ఏపీలో ఆఫ్ఘనిస్తాన్ కన్నా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి: అచ్చెన్నాయుడు

-

కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికినా పోలీసులు అరెస్ట్ చేయకుండా నిందితులను కాపాడుతూ బాధితులను వేధించడం దుర్మార్గమన్నారు అచ్చెన్నాయుడు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.” పోస్టుమార్టం కోసం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారు. పోలీసుల తీరును ప్రశ్నించినందుకు మృతుడి భార్య పైన చేయి చేసుకోవడం వైసిపి రాక్షస మనస్తత్వానికి నిదర్శనం.

ముఖ్యమంత్రి విహార యాత్ర కు వెళుతూ… వైసిపి మూకలను ప్రజల మీదికి వదిలి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్ఘనిస్తాన్ కన్నా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా బాధిత కుటుంబాన్ని వైసీపీ నేతలు ఎందుకు పరామర్శించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని. బాధిత కుటుంబానికి అండగా నిలబడినందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, దళిత సంఘాల పై దాడులకు దిగుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ ను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది.” అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news