`దిశ` హత్యాచార ఘటనను పార్లమెంటులో ప్రస్తావించనున్న కాంగ్రెస్ ఎంపీలు

-

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ‘దిశ’ హత్యాచార ఉదంతం ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించనున్నారు. ఈ మేరకు పార్టీ తరఫున ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ కేసులో నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. దిశ హత్య ఘటన నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ కోర్టులో షాద్ నగర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఈ రోజు లేదా రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీనిపై కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోనుంది. నిందితుల తరఫున వాదించవద్దని బార్ అసోసియేషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆదివారం బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్.. ఈ ఘటనను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news