కాంగ్రెస్ కీలక నేతని మింగేసిన కరోనా

-

కాంగ్రెస్ పార్టీ కురువృద్దుడు మెన్నేన్ని సత్యనారాయణ రావు(ఎమ్మెస్సార్)  కరోనాతో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మరణించారు. 1934 జనవరి 14 న జన్మించిన ఎమ్మెస్సార్ అనారోగ్యానికి గురికావడంతో నిమ్స్ లో జాయిన్ చేసి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర కు చెందిన ఎమ్మెస్సార్ కరీంనగర్ నుండి 1971 నుండి 1984 వరకు కరీంనగర్ ఎంపీగా మూడు సార్లు గెలిచారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ఇంఛార్జిగా కూడా వ్యవహరించారు. ఇందిరాగాంధీ సన్నిహితునిగా ఉన్న ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1990 నుంచి 1994 వరకు, 2007 నుండి 2014 వరకు రెండు సార్లు ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో పీసీసీ అధ్యక్షునిగా కూడా పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news