రాహుల్ గాంధీ సభ కోసం కాంగ్రెస్ సిద్ధం…. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ ల నియామకం

-

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. మే 6,7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటణ ఖరారైన సంగతి తెలిసిందే. మే 6న వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.  ఈనేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులను నియమిస్తోంది కాంగ్రెస్. నల్లగొండ- గీతారెడ్డి, భువనగిరి- జగ్గారెడ్ది, మహబూబాబాద్- శ్రీధర్ బాబు, కరీంనగర్- షబ్బీర్ అలీ ఇలా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులను నియమించారు. ఈరోజు (  శనివారం ) గాంధీ భవన్ లో జిల్లాాల నేతలతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జన సమీకరణకు సంబంధించి కాంగ్రెస్ నజర్ పెట్టింది. దాదాపు 5 లక్షల మందితో బలప్రదర్శన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పర్యటన నేపథ్యంలో జిల్లాల వారీగా రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 24న వరంగల్ నేతలతో హైదరాబాద్ లో సమావేశం అవనున్నారు. 25న కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. 26న ఖమ్మంలో పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news