ఏపీలో శాంతించిన క‌రోనా.. నేడు 10,310 కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు క‌నిపిస్తుంది. రోజు రోజుకు క‌రోనా కేసులు సంఖ్య కొంత వ‌ర‌కు త‌గ్గుతూ వ‌స్తుంది. నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించిన కరోనా బులిటెన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 10,310 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ శ‌నివారంతో పోలిస్తే.. ఈ రోజు రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే త‌గ్గింది. నిన్న‌టితో పోలిస్తే ఈ రోజు 1,263 క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గాయి.

అయితే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు తగ్గుముఖం ప‌ట్టినా.. మ‌ర‌ణాల సంఖ్యలో మాత్రం త‌గ్గుద‌ల క‌నిపించ‌డం లేదు. గ‌డిచిన 24 గంట‌ల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల 12 మంది మ‌ర‌ణించారు. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 9,692 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 1,16,031 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 39,296 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news