భారత్ లో కరోనా కల్లోలం.. రెండో రోజూ రెండు లక్షల కేసులు ?

-

భారతదేశంలో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. రెండోసారి రోజు కూడా వరుసగా దేశంలో రెండు లక్షలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. భారతదేశం విషయానికి వస్తే 24 గంటల్లో 199376 కరోనా కేసులు నమోదు కాగా 1027 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

కరోనా వైరస్
కరోనా వైరస్

ఇప్పటిదాకా భారతదేశంలో మొత్తం 13873825 కరోనా కేసులు నమోదు కాగా 172085 మంది మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో నిన్న రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా ఎనిమిది మంది మృతి చెందారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సుమారు నాలుగు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 18 మంది మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news