భారత్ లో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.

గత 24 గంటల్లో 19,906 కొత్త కేసులు నమోదయ్యాయని, 410 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,28,859కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 16,095కి చేరుకుంది. ప్రస్తుతం 2,03,051 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 3,09,712 మంది వైరస్ నుండి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news