తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే అధిక స్థాయిలో కేసులు..!

-

తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,593 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38,044కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 493కి పెరిగింది. కరోనాతో ఇప్పటి వరకూ కోలుకొని 19,393 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 18,159 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక తెలంగాణలో కొత్తగా1,676 కరోనా కేసులు నమోదు కాగా 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,018కి చేరింది. కరోనా సోకి మొత్తం 396 మంది చనిపోయారు. ఇప్పటివరకూ కోలుకుని 27,295 మంది డిశ్చార్జు కాగా గురువారం 1296 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news