కరోనా మహమ్మారి కోరలు చాచింది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే లక్షల మంది ప్రజలు దీని బారిన పడగా, వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రజప్రతినిధులు సైతం ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని సూచించారు. అయితే ఇప్పుడు ఈ మహమ్మారి సెగ జైళ్లకు సైతం తాకింది. ఇప్పటికే దేశంలోని కొన్ని జైలల్లో కరోనా వ్యాపించింది. అలాగే ఇటీవల తిరుపతి సబ్ జైల్లో ఓ నిందితుడికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపుతోంది. ఓ కిడ్నాప్ కేసులో విజయవాడ జైలు నుండి రాజమండ్రి జైలుకు వచ్చిన రిమాండ్ ఖైదీకి ఆరోగ్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో జైలు సిబ్బంది, తోటి ఖైదీల్లో ఆందోళన నెలకొంది. కాగా ఆ నిందితుడిని ఆసుపత్రికి తరలించగా జైలును శానిటైజ్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక ఆ నిందితుడిని తీసుకువచ్చిన పోలీసులను క్వారంటైన్ చేశారు.
రాజమండ్రి జైలులో కరోనా కలకలం..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
వేసవి సెలవులు ప్రారంభం కావడంతో చాలాా మంది పుణ్యక్షేత్రాలు, ఇతర ప్రదేశాలకు...
టీటీడీ వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వద్ద ఉన్న రూ.2 వేల నోట్ల...
ఇవాళ మెదక్ జిల్లాలో కాంగ్రెస్ జనజాతర సభకు సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో...