సజ్జనార్ దెబ్బ : రాపిడోకు కోర్టు లో ఎదురు దెబ్బ

-

ఇటీవలీ కాలంలో హీరో అల్లు అర్జున్‌, రాపిడో సంస్థకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు గానూ.. హీరో అల్లు అర్జున్‌, రాపిడో సంస్థకు అధికారులు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్‌ నటించిన రాపిడో ప్రకనటపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభ్యంతరం వ్యక్తం చేసి… నోటీసులు జారీ చేశారు.

అయితే.. ఈ కేసులో.. తాజాగా తెలంగాణ హై కోర్టు రాపిడో సంస్థకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఆర్టీసీ పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని రాపిడోను ఆదేశించింది కోర్టు. యూ ట్యూబ్‌ లో కూడా ఉన్న వీడియోలను, పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని కూడా ఆదేశించింది కోర్టు. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. కోర్టు తీర్పుపై రాపిడో ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news