పల్నాడు జిల్లా నరసారావుపేట డిఎస్పి కి కోర్టు నోటీసులు

-

పల్నాడు జిల్లా నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కరరావు, గవర్నమెంట్ డాక్టర్ రాజశేఖర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. గత నెల 27న రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెంలో గంగినేని పున్నయ్య అనే వ్యక్తి తనని గొడ్డలితో దారుణంగా నరికాడని పోలీసులకు పిర్యాదు చేసిన అదే గ్రామానికి చెందిన చెంచారావు, పున్నయ్యపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేసారు పోలీసులు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాడు చెంచారావు. చెంచారావుకి తీవ్ర గాయాలు అయినట్లు రిపోర్ట్ ఇచ్చాడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు రాజశేఖర్.

గంగినేని పున్నయ్య నరకడం వల్లే చెంచారావుకి తీవ్ర గాయాలు అయ్యాయని రిపోర్టు ఇచ్చాడు నరసరావుపేట డీఎస్పీ విజయ్ భాస్కర్. నిన్న చెంచారావుని స్వయంగా పరామర్శించి దెబ్బలను పరిశీలించారు జడ్జి. చెంచారావు ఒంటిపై ఒక్క చిన్న దెబ్బ కూడా లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేసారు జడ్జి. నిందితుడుకి బెయిల్ రాకుండా కావాలనే తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లు ధ్రువీకరించుకున్నారు జడ్జి. దీంతో పున్నయ్యకి బెయిల్ మంజూరు చేసారు జడ్జి. జరిగిన ఘటనపై పది రోజుల్లో సమాధానం చెప్పాలని వారికి నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news