గుంటూరులో టీడీపీ నేత దారుణ హత్య

-

ఏపీ మరో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ కీలక నేత దారుణ హత్యకు గురయ్యాడు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపేశారు. చంద్రయ్య గ్రామ సెంటర్‌ లో కూర్చుని ఉన్న సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకుంది.

హత్య అనంతరం ప్రత్యర్థులు పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని.. మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటన తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ సంఘటనపై టీడీపీ యంగ్‌ లీడర్‌, మాజీ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. “గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, గుండ్లపాడు గ్రామంలో వైసిపి ఫ్యాక్షన్ మూకలు టిడిపి గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి” అంటూ నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news