భార్య మృతిని తట్టుకోలేక వృద్ధుడి ఆత్మహత్య.. ఒకే చితిపై అంత్యక్రియలు

-

70ఏండ్ల వైవాహిక బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది. వృద్ధాప్య సమస్యలతో భార్య మృతిచెందగా, ఆమె లేని లోకంలో నిమిషమైనా ఉండలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వృద్ధ దంపతులను ఒకే చితిపైన దహనం చేసి కుటుంబ సభ్యులు అంతిమ వీడ్కోలు పలికారు.

నల్లగొండ జిల్లా చందంపేట మండలం తెల్‌దేవరపల్లి గ్రామానికి చెందిన ఎర్ర అంతిరెడ్డి(90), లక్ష్మమ్మ(78) దంపతులకు ఇద్దరు కుమారు, ఒక కుమార్తె. పిల్లలంతా పట్టణంలో స్థిరపడ్డారు. అయినా అంతిరెడ్డి, లక్ష్మమ్మలు స్వగ్రామంలోనే ఉంటున్నారు. చేతి కాని వయసులో కూడా ఒకరి మరొకరు తోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

వృద్ధాప్య సమస్యలతో బుధవారం తెల్లవారుజామున లక్ష్మమ్మ తుది శ్వాస విడిచారు. భార్య మృతిచెందిందన్న విషయం గమనించిన అంతిరెడ్డి వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉదయం భార్యభర్తలు బయటకు రాకపోవడంతో పక్కింటివారు వచ్చి చూడగా అంతిరెడ్డి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. లక్ష్మమ్మ మృతిచెందడం, అంతిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఇద్దరికీ ఒకే చితి పేర్చి దహనం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news