ఇనుప రాడ్‌‌తో బట్టలు తీసే ప్రయత్నం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

-

కరెంట్ తీగలపై పడిన బట్టలను ఇనుప రాడ్‌‌తో తీసే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి. కరెంట్ షాక్‌కు గురై కేకలు వేయడంతో చంకన పిసిబిడ్డతో వచ్చిన మహిళ అతడిని పట్టుకున్నది. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ గ్రామంలో చోటుచేసుకున్నది.

ఒడిశా రాష్ట్రం జగత్‌సింగ్‌పూర్ జిల్లా జాజిపూర్‌కు చెందిన మల్లిక్ (36) కుటుంబంతో సహా ఇస్నాపూర్‌లో నివసిస్తున్నాడు. పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. తాను నివాసం ఉంటున్న ఇంటి బాల్కనీలో ఆరేసిన బట్టలు సమీపంలోని కరెంట్ తీగలపై పడ్డాయి. వాటిని ఇనుపరాడ్‌తో తీసేందుకు మల్లిక్ ప్రయత్నించాడు. దీంతో కరెంట్ షాక్‌కు గురై కేకలు వేయడంతో ఆయన రీనా, చంకలో చిన్న కుమార్తె కన్నూ(2)తో పాటు పరుగెత్తుకువచ్చారు. భర్తను రక్షించే ప్రయత్నం చేయగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. సంఘటన స్థలంలోనే మల్లిక్, కన్నూ మృతిచెందగా, రీనా హాస్పిటల్‌కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో మల్లిక్ పెద్ద కుమార్తె స్కూల్‌కు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది.

 

Read more RELATED
Recommended to you

Latest news