సోషల్ మీడియాలో చిన్నారుల అశ్లీల చిత్రాలు అప్లోడ్ చేస్తున్న వారిపై కేసు నమోదు

-

సోషల్ మీడియాలో చిన్నారుల అశ్లీల చిత్రాలు, వీడియోలను అప్లోడ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేస్బుక్, యూట్యూబ్, జిమెయిల్ ద్వారా పిల్లల అసలీల చిత్రాలను అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు ఏపీ సిఐడిి అధికారులు. ఈ కేసులో 12 మంది నిందితులు ఉండగా వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కు సమాచారం ఇచ్చారు ఏపీ సిఐడి అధికారులు.

దీంతో రంగంలోకి దిగిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు 67 బి, ఐటిఏ 2000 – 2008 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. వీడియోలు అప్లోడ్ చేసిన 12 మందిని విజయవాడ వాసులుగా గుర్తించారు. సోషల్ మీడియాలో చిన్నారులు అశ్లీల చిత్రాలు, వీడియోలు అప్లోడ్ చేయడం తీవ్రమైన నేరమని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news