ఏపీలో దారుణం.. ప్రియుడి ముందే యువ‌తిపై లైంగిక దాడి

-

ప్రియుడిని చెట్టుకు కట్టెసి.. యువ‌తిపై మందు బాబులు లైంగిక దాడి చేశారు. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న ఆంధ్ర ప్ర‌దేశ్ లోని కృష్ణా జిల్లా బంద‌రు మండ‌లం ప‌ల్లి పాలెం బీచ్ వ‌ద్ద చోటు చేసుకుంది. కాగ ప‌ల్లి పాలెం గ్రామంలో ఉన్న బీచ్ కు ఒక ప్రేమ జంట స‌ర‌దాగా వెళ్లారు. అయితే అక్క‌డే ఉన్న కొంత మంది మందు బాబులు.. వీరిని గ‌మ‌నించారు. దీంతో ఈ ప్రేమ జంటపై దాడి చేశారు. అనంత‌రం ప్రియుడిని చెట్టుకు క‌ట్టెసి.. యువ‌తిని అత్యాచారం చేశారు.

కాగ యువ‌తి త‌న ఇంటికి వెళ్లిన త‌ర్వాత‌.. త‌న ప‌రిస్థితిని గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు.. జ‌రిగ‌న దానికి గురించి ఆరా తీశారు. దీంతో సంచ‌ల‌న విషయాలు తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు.. పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో పోలీసులు ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకుని.. ద‌ర్యాప్తు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు నిందితులు ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. అందులో ఒక్క‌రిని ప‌ట్టుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. కాగ మ‌రోక్క‌రి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news