దారుణం: లోక్ సభ ఎన్నికల వేళ.. ఎమ్మెల్యేను చంపేశారు..!

-

ఇంకో రెండు రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేనే మట్టుబెట్టారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో చోటు చేసుకుంది. దంతెవాడలోని నకులనార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిని మావోయిస్టులు చంపేశారు.

ఆయన వాహనాన్ని టార్గెట్ చేసుకున్న మావోయిస్టులు అడవి గుండా వాహనం వెళ్తుండగా.. వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. అనంతరం కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన భద్రతా సిబ్బంది ముగ్గురు, కారు డ్రైవర్ ను కూడా మావోలు చంపేశారు. దీంతో ఛత్తీస్ గఢ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version