కన్న తండ్రి కిరాతకం..కూతురిని చంపి.. మృతదేహంతో శృంగారం

-

సొంత కూతురినే గొంతుకోసి చంపి..శృంగారం చేశాడు ఓ కసాయి తండ్రి. అంతేకాదు.. తన కూతురు కనిపించలేదని పోలీసులను ఆశ్రయించిన సంఘటన మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌ లోని ముకవన్‌ గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి 14 ఏళ్ల కూతురు ఉంది.

ఇటీవల అతడు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి.. తన కూతురు కనిపించడం లేదని మిస్సింగ్‌ కేసు పెట్టాడు. దీంతో మిస్సింగ్‌ నమోదు చేసుకున్నారు పోలీసులు. అనంతరం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి… ఆ బాలిక కోసం గాలించారు. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది.

అయితే.. ఈ నేపథ్యంలోనే… ఆ బాలిక తండ్రిని పోలీస్‌ స్టేషన్‌ కు పిలిచి..గట్టిగా విచారణ చేశారు పోలీసులు. ఐతే ప్రశ్నించిన ప్రతి సారీ.. తన వాంగ్మూలాన్ని మార్చి చెప్పాడు ఆ కసాయి తండ్రి. అప్పుడు పోలీసులు అనుమానం వచ్చింది. నాలుగు తగిలించి… గట్టిగా ప్రశ్నిస్తే… అసలు విషయం చెప్పాడు. తన కూతురిని చంపేసి.. అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news