ఒక యువకుడిని కిడ్నాప్ చేసి రేప్‌ చేసిన నలుగురు అమ్మాయిలు..!!

-

మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న ఈరోజుల్లో.. ఒక యువకుడిపై గ్యాంగ్‌రేప్‌ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.. ఏకంగా నలుగురు అమ్మాయిలు ఆ యువకుడిని కిడ్నాప్ చేసి రేప్‌ చేశారు. కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమండి..! పంజాబ్‌లో జరిగిన ఈ ఘటన తాలుకూ వివరాలు ఇలా ఉన్నాయి..

నలుగురు అమ్మాయిలు ఒక యువకుడిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన ఘటన పంజాబ్‌లోని జలంధర్లో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితుడే స్వయంగా ఈ విషయాన్ని తెలిపాడు. తాను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. 22 నుంచి 23ఏళ్ల మధ్య ఉన్న నలుగురు అమ్మాయిలు.. కారులో వచ్చారని.. తనను ఓ అడ్రస్ అడిగారని అతడు చెప్పాడు. అడ్రస్ చెబుతుండగా.. తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని.. తర్వాత మత్తు మందు ఇచ్చి ఒక రాత్రంతా రేప్ చేశారని తెలిపాడు. ఆ తర్వాత తనని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారని వివరించాడు. అచ్చం అమ్మాయిలకు జరిగినట్లుగానే ఉంది కదూ..

బాధిత యువకుడు ఏం చెప్పాడో అతని మాటల్లోనే.. ”నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నా. అదే సమయంలో ఓ తెల్ల కారు వచ్చింది. అందులో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కారు నడుపుతున్న అమ్మాయి నాకో పేపర్ ఇచ్చింది. అందులో అడ్రస్ గురించి చెప్పాలంది. నేను ఆ స్లిప్ చూస్తున్నా. ఇంతలో నా కళ్లలో ఏదో కెమికల్ చల్లింది. దీంతో నా కళ్లు కనిపించలేదు. ఆ తర్వాత నా కళ్లకు గంతలు కట్టారు. నా చేతులు కట్టేశారు. నన్ను కిడ్నాప్ చేసి కారులో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడే ఆ అమ్మాయిలంతా మందు తాగారు. నన్ను కూడా తాగమని బలవంతం చేశారు. నాకు మత్తుమందు ఇచ్చారు. నేను స్పృహ కోల్పోయాక నన్ను రేప్ చేశారు. ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటల సమయంలో నన్ను ఓ ప్రాంతంలో పడేసి పోయారు” అని బాధిత యువకుడు తెలిపాడు.

కాగా, దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. స్థానిక మీడియాకు మాత్రమే ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇంత ఘోరం జరిగింది కదా, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని మీడియా వాళ్లు అడిగితే.. తనకు పెళ్లైందని, పిల్లలు ఉన్నారని అందుకే పోలీసులకు చెప్పలేదని ఆ వ్యక్తి తెలిపాడు. ప్రాణాలతో తిరిగి వచ్చారు, అదే చాలు, పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని తన భార్య వేడుకుందట.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆ వ్యక్తి తెలిపాడు.

ఆ వ్యక్తి ఓ లేబర్.. లెదర్ ఫ్యాక్టరీలో పని చేస్తాడు. ఆ నలుగురు అమ్మాయిలు మంచి కుటుంబాలకు చెందిన వారిలా అనిపించారని అతడు తెలిపాడు. అందరూ తమలో తాము ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకున్నారని తనతో మాత్రం పంజాబీలోనే మాట్లాడారని చెప్పాడు. కాగా.. నలుగురు అమ్మాయిలు ఓ మగాడిని కిడ్నాప్ చేసి రేప్ చేశారనే వార్త సంచలనం రేపడంతో.. పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. రేప్ వార్తల నేపథ్యంలో సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టారు. నిజానిజాలు తేల్చే పనిలో ఉన్నారు… అతడు చెప్పింది నిజమా? లేక కట్టుకథా? అనేది త్వరలోనే తేలుస్తామని అక్కడి పోలీసులు వివరించారు. అయినా ఆ అమ్మాయిలు అలా ఎందుకు చేశారో..?

Read more RELATED
Recommended to you

Latest news