సిద్దిపేట జిల్లాలో దారుణం.. బతుకమ్మ ఆడుతుండగా మహిళ హత్య

-

సిద్దిపేట జిల్లా వీరాపూర్ బతుకమ్మ వేడుకల్లో దారుణం చోటుచేసుకుంది. బతుకమ్మ ఆడుతున్న ఓ మహిళను ఆమె భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా ప్రకంపనలు సృష్టించింది. భార్యను చంపిన తర్వాత అతడు అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. సిద్దిపేట జిల్లా వీరాపూర్ లో స్వప్న అనే మహిళను స్థానికుడైన యాళ్ల ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల వరకు వీరి కాపురం సజావుగా జరిగింది. తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు మొదలయ్యాయి. స్వప్న ఇదే గ్రామానికి చెందిన రమేశ్‌ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. దీంతో ఎల్లారెడ్డి పలుమార్లు ఆమెతో గొడవకు దిగి చంపేస్తానని బెదిరించాడు.

ఆదివారం రాత్రి తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతుండగా.. స్వప్న తలపై ఎల్లారెడ్డి ఇనుప రాడ్‌తో బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news