ఫైనాన్స్ వ్యాపారిని పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు

-

విజ‌య‌వాడ న‌గ‌రం ఉలిక్కిప‌డింది. గవర్నర్ పేట బిగ్ బజార్ సమీపంలో శుక్ర‌వారం దారుణం జరిగింది. గగారిన్ అనే ఫైనాన్సియ‌ర్‌పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ గగ‌రిన్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో గగారిక్‌ చికిత్స పొందుతున్నాడు. వెంటిలేటర్‌పై గగారిక్‌కు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తేకానీ చెప్పలేమని డాక్టర్ రామారావు వెల్లడించారు. మాదాల సురేష్‌, మాదాల సుధాకర్‌లు తనపై పెట్రోల్ పోసి తగుటబెట్టారని గగారిన్‌ పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. రూ. కోటి ఫైనాన్స్‌ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news