మహిళ ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న పండ‌గ‌.. ఏం జ‌రిగిందంటే..

-

ప్రకాశం జిల్లా టంగుటూరులోని శ్రీనివాసనగర్‌కు చెందిన కుంచాల వరుణ్‌కు కందుకూరు మండలం పలుకూరుకు చెందిన మౌనిక(21)ను ఇచ్చి అయిదు నెలల కిత్రం వివాహం చేశారు. కుమార్తె, అల్లుడిని దసరా పండగకు ఇంటికి ఆహ్వానించేందుకు మౌనిక తండ్రి. దీంతో పుట్టింటికి వెళ్లే విషయంలో మౌనిక భర్తతో గొడవపడింది. ఆదివారం భర్త బయటకు వెళ్లిన సమయంలో మౌనిక గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆ త‌ర్వాత ఇంటికి వచ్చిన వరుణ్ భార్యను చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. దీంతో పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి.. పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ప్ర‌స్తుతం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news