రైలులో యువ‌తిపై అత్యాచారం.. 15 మంది అరెస్ట్

-

మ‌ధ్య ప్ర‌దేశ్ భోపాల్‌లో దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ యువ‌తి పై రైలులో అత్యాచారానికి పాల్ప‌డ్డాడు కిరాత‌కుడు. సంప‌ర్క్ క్రాంతి రైలు యెస్వంత్‌పూర్ నుంచి హ‌జ్ర‌త్ నిజాముద్దిన్ వెళ్లుతుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘట‌న‌కు సంబంధించి పోలీసులు 15 మంది చిరువ్యాపారుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువ‌తి రైలు ఎక్కిన త‌రువాత ఆమెకు కూర్చునేందుకు సీటు ల‌భించ‌లేదు.

దీంతో వంట చేసే బోగీలో ఖాళీ స్థ‌లం ఉంద‌ని, అక్క‌డ విశ్రాంతి తీసుకోవ‌చ్చ‌ని యువ‌తిని న‌మ్మించి తీసుకెళ్లాడు ఓ వ్య‌క్తి. అనంత‌రం ఆమె నిద్రించే స‌మ‌యంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రేప్‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన భోపాల్ రైల్వే స్టేష‌న్ చేరుకున్నారు. వంట‌చేసే బోగీ వ‌ద్ద‌కు వెళ్ల‌గా అందులో ఉన్న వారు డోర్ ఓపెన్ చేయ‌లేదు. అయితే పోలీసులు ఒత్తిడి చేసాక అర‌గంట త‌రువాత తలుపులు తెరిచారు.

అప్ప‌టికే బాధితురాలు అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉంది. ఏమి మాట్లాడ‌లేకపోయింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుప‌త్రికి పోలీసులు త‌ర‌లించారు. చికిత్స అనంత‌రం బాధితురాలు జ‌రిగిన విష‌యాన్ని పోలీసుల‌కు చెప్పింది. మొత్తం 15 మంది చిరువ్యాపారుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. అస‌లు నిందితుడిని గుర్తించేందుకు విచారించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news