మధ్యప్రదేశ్ లో దారుణం…. కొడుకుకు తుపాకీ గురిపెట్టి బెదిరించి తల్లిపై అత్యాచారం

-

దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా.. మహిళలు ఇంకా భయంభయంగానే బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజుకు ఎక్కడోచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు అత్యాచారాలకు తెగబడుతున్నారు. నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చిన కామాంధుల్లో భయం ఉండటం లేదు.  ఇదిలా ఉంటే సభ్య సమాజం తలదించుకునేలా మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. చిన్న పిల్లాడిని చంపుతామంటూ… తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

RAPE

మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఓ మహిళ(24) పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి మూడేళ్ల కుమారుడికి తుపాకీ గురిపెట్టి బెదిరించి ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు విక్రమ్(28), కృష్ణ శర్మ(30) ఇద్దరు తన బిడ్డను చంపేస్తామని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news