సౌత్ మూవీస్ పై అక్కసు వెళ్లగక్కుతున్న క్రిటిక్ కేఆర్కే… ఆర్ఆర్ఆర్ కన్నా మంచి సినిమా తీస్తా అంటూ వ్యాఖ్యలు

-

సౌత్ మూవీస్ పై బాలీవుడ్ రగిలిపోతోంది. వరసగా సౌత్ సినిమాలు బాలీవుడ్ మార్కెట్ ఆక్రమిస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ దండయాత్ర పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ ఇలా కొనసాగుతోంది. సౌత్ మూవీస్ దెబ్బకు హిందీ సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్లు మార్చుకుంటున్నాయి. అంతలా బాలీవుడ్ ఇండస్ట్రీని భయపెడుతున్నాయి. అయితే ఇది మాత్రం అక్కడి వారికి నచ్చడం లేదు. బాలీవుడ్ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రముఖ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ ( కేఆర్కే) ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ సినిమాలపై నోరు పారేసుకుంటున్నాడు. 

ట్రిపుల్ ఆర్ సినిమా కన్నా మంచి సినిమా తీస్తా అంటూ వ్యాఖ్యలు చేశాడు కేఆర్కే. తాను ట్రిపుల్ ఆర్ కన్నా మంచి సినిమాను కేవలం రూ. 50 కోట్లతోనే తీస్తా అని.. తాను తీసిన సినిమా ఖచ్చితంగా రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్లు వసూలు చేస్తుందంటూ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో కూడా ట్రిపుల్ ఆర్ సినిమాపై ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ ఆర్ సినిమా చెత్త సినిమా అని…డైరెక్టర్ రాజమౌళిని జైల్లో వేయాలంటూ వ్యాఖ్యానించాడు. ఆతరువాత కేజీఎఫ్ 2పై కూడా తన అక్కసు వెళ్లగక్కాడు. కేజీఎఫ్, ట్రిపుల్ ఆర్ కన్నా చెత్త సినిమా అంటూ వ్యాఖ్యలు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news