పదేళ్లలో ధోని సిఎస్కే అధినేత అవుతాడు: విశ్వనాథన్

-

నేటితో ధోనీ 39 వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. నేడు ఆయనకు అనేక దేశాల నుండి అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ విశ్వనాథన్ ధోనిపై ఆచర్య కర వ్యాఖ్యలు చేశారు. ఇంకో పది సంవత్సరాలలో మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ చెన్నై జట్టుకు అధినేతగా ఎదుగుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ధోని ఇంతవరకు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. ఆ సమయంలో కొంత కాలం పాటు సైన్యానికి సేవ కూడా చేశారు.

MS-Dhoni-Chennai-Super-Kings-CSK-IPL-2020
MS-Dhoni-Chennai-Super-Kings-CSK-IPL-2020

అయితే నేటి నుండి 10 సంవత్సరాల్లో మహేంద్ర సింగ్ ధోనీ కచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు యజమాని అవుతాడని ఆయన జోస్యం తెలిపారు. ఇకపోతే ఐపీఎల్ కోసం మార్చిలో జరిగిన శిక్షణా శిబిరంలో మహేంద్రసింగ్ ధోని చాలా కష్టపడ్డాడని తెలిపాడు. నిజానకి ఐపీఎల్ సీజన్ లో చాలా బాగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ధోనీ అత్యుత్తమ ఆటగాడని ఎప్పటికీ అలాగే ఉంటాడని విశ్వనాథన్ తెలిపారు. దానితోపాటు మహేంద్రసింగ్ ధోని కి తాలా అనే పేరు ఎలా పెట్టారో కూడా వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news