రేపు సాయంత్రం సిడబ్ల్యుసి కీలక సమావేశం

-

రేపు సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలో సిడబ్ల్యుసి సమావేశం జరగనుంది. సంస్థాగత వ్యవహారాలపై సిడబ్ల్యుసి చర్చించనుంది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్ల్యూసి) రేపు నిర్వహించే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ని ఖరారు చేసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ ” భారత్ జోడో” యాత్రపై కూడా చర్చించనున్నారు. అక్టోబర్ 2 నుంచి  భారత్ జూడో యాత్రను ప్రారంభించాలని తోలుత నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత సెప్టెంబర్ 7 కు మార్చారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర రూట్ మ్యాప్ ని విడుదల చేశారు. ఈ యాత్ర మొత్తం 3,571 కిలోమీటర్ల మేర సాగనుంది.

రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర 148 రోజులపాటు 68 లోక్సభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 100 కిలోమీటర్ల మేర నాలుగు రోజులపాటు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news