కరీంనగర్ : టెక్నాలజీ వాడి సొంతింటికే కన్నం వేసిన కొడుకు కోడలు..!

-

ఆస్తి కోసం కన్న తండ్రిని టెక్నాలజీ వాడి కొడుకు, కోడలు మోసం చేసిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లో ఉంటూ, కరీంనగర్ లో ఉన్న సొంత ఇంటికి కన్నం వేసి ఆస్తి కాజేసెందుకు కొడుకు కోడలు మాస్టర్ ప్లాన్ వేశారు. రవి అనే వ్యక్తి తన తండ్రికి తెలియకుండానే ఫోన్ లో కాల్ రికార్డింగ్ ఆప్ ఇన్ స్టాల్ చేశాడు. ఆ యాప్ ను రవి తన జీ మెయిల్ కు అనుసంధానం చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న డబ్బు ఆస్తి పత్రాల గురించి తండ్రి ఇతరుల తో చర్చించడం కొడుకు కోడలు విన్నారు.

ఇక హైదరాబాద్ కు వెళ్లేందుకు తండ్రి ఇంటికి తాళం వేయగా ఇదే అదునుగా చూసి ఇంట్లో ఉన్న 25 లక్షల నగదు ఆస్తుల పత్రాలను కొడుకు కోడలు కాజేసారు. అనుమానం వచ్చి తండ్రి ఫోన్ ను పరిశీలించగా తన ఫోన్ లో కాల్ రికార్డింగ్ యాప్ చూసి బిత్తరపోయాడు. అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపగా కన్న కొడుకు మరియు కోడలు కలిసి ఇంటికి కన్నం వేసినట్టు నిర్ధారణ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news