కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం.. సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం కొత్త టోల్ ఫ్రీ నెంబర్ గా ‘1930’

-

ఇటీివల కాలంలో నేరాల తీరు మారింది. గతంలో లాగా ఇంటి తాళాలు పగలకొట్టి సొమ్మును ఎత్తుకుపోవడం చేయడం లేదు దొంగలు. ఏకంగా బ్యాంకు ఖాతాలోకి దూరి నగదు దొంగలిస్తున్నారు. సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఓటీటీ ఫ్రాడ్స్, అకౌంట్ హ్యాకింగ్, లాటరీ ఫ్రాడ్స్ ఎక్కువ అయ్యాయి. వీటిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది. పోలీస్ శాఖ ప్రత్యేకంగా సైబర్ సెల్ ఏర్పాటు చేసి సైబర్ నేరాలను దర్యాప్తు చేస్తోంది.

సైబర్ నేరాలపై కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న టోల్ ఫ్రి నెంబర్ ని మార్చింది. గతంలో 155260గా టోల్ ఫ్రీ నెంబర్ ఉండేది. అయితే ఈ నెంబర్ అసౌకర్యంగా ఉందంటూ.. చాలా ఫిర్యాదు వచ్చాయి. దీంతో కొత్తగా ‘1930’ ని కొత్త టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకువచ్చింది. హోం శాఖ మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ విభాగాలతో, ఐటీ నిపుణులతో చర్చింది….1930ని టోల్ ఫ్రీ నెంబర్ గా ఫిక్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news