బ‌లగం మొగిల‌య్య‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రోసా…దళితబంధు మంజూరు

-

బలగం సినిమాలో కుటుంబ సభ్యుల ఆత్మీయతను చాటి చెప్పేలా ఎమోషనల్ పాట పాడి అందరి మనసులు గెలుచుకున్న పస్తం మొగిలయ్యకు దళిత బంధు మంజూరైంది. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు తమ కళ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. బలగం సినిమాతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న మొగిలయ్య దంపతులను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని వారి యోగక్షేమాలను తెలుసు కున్నారు.

Balagam Mogilaiah | ‘బలగం’ మొగిల‌య్య‌కు స‌ర్కార్ భ‌రోసా.. ద‌ళిత‌బంధు మంజూరు

మొగిలయ్య కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది ఆయన యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల పేరు ప్రఖ్యాతులను బ‌లగం సినిమా ద్వారా దేశవ్యాప్తం చేసిన మొగిలయ్య దంపతుల ప్రతిభ ఎంతో గొప్పదని ఎమ్మెల్యే అన్నారు. మొగిలయ్య ఆరోగ్యం బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మొగిలయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ స్వప్న దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news