మహిషాసురమర్దినిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం

-

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 9వ రోజున మహిషాసురమర్దిని అలంకారంలో దుర్గమాత అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే, దసరా నేపథ్యంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.మహిషాసుర సంహారం జరిగిన రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఇంద్రకీలాద్రిపై రేపు పూర్ణాహుతితో అమ్మవారి వేడుకలు పరిసమాప్తం కానున్నాయి. భవానీ దీక్షాదారుల రాకతో ఇంద్రకీలాద్రిపై భక్తులు రద్దీ బాగా పెరిగింది. జల విహారంపై శుక్రవారం మధ్యాహ్నంలోగా నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే దుర్గమ్మను ఏసీ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ దంపతులు దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, దుర్గమ్మ అనుగ్రహంతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పురోగమిస్తుంచాలని ఆకాంక్షించారు.నీతిఆయోగ్‌ ప్రతినిధుల బృందం కూడా దుర్గమ్మను దర్శించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version