ఆస్తి కోసం అత్తను ఉరేసి చంపిన కోడలు

-

కృష్ణ జిల్లా లోని పెడన లో దారుణం చోటుచేసుకుంది. వ్యక్తిగతంగా దూషిస్తుందని, ఆస్తి ఇవ్వడం లేదని అత్తకు ఊరేసి చంపింది కోడలు. ఇల్లన్నాక కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి గొడవలు సహజమే. అయితే అత్త, కోడళ్ళ మధ్య మాత్రం నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. కోడలు పై పెత్తనం చలాయించాలని అత్త.. అత్త ముందు తలవంచకూడదని కోడలు. నిత్యం కొట్లాడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఇవన్నీ శృతిమించితుంటాయి. ఇక్కడ ఇదే జరిగింది.

వ్యక్తిగతంగా దూషిస్తుందని, ఆస్తి ఇవ్వడం లేదనిఅత్తకు ఊరేసి సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కోడలు. పోస్టుమార్టం రిపోర్ట్ తో కోడలి హై డ్రామా బయటపడింది. సిఐ వీరయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..” అత్త తలపై కొట్టి స్పృహ కోల్పోయిన అత్తకి చీరతో ఉరి వేసింది కోడలు కొండలమ్మ. అనంతరం ప్రమాదవశాత్తు అత్త రజని పడిపోయిందని భర్తకు కాల్ చేసి చెప్పింది.

హాస్పిటల్ కు తీసుకుని వెళ్లిన రొండు రోజులకు చనిపోయిన ఆమె పోస్టుమార్టం రిపోర్ట్ లో ఉరి వేసిన వ్యవహారం బయట పడింది. దాంతో అనుమానాస్పద కేస్ గా నమోదు చేసి కోడలిని విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. వ్యక్తి గతంగా దూషిస్తుందని, ఆస్తి ఇవ్వటం లేదని కక్ష తో చంపినట్లు ఒప్పుకుంది.” అని సిఐ వీరయ్య గౌడ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news