నిరుద్యోగులను రెచ్చకొడితే ఊరుకోము… కేటీఆర్ కి దయాకర్ వార్నింగ్

-

కేటీఆర్‌కు మైండ్ దొబ్బిందని, పవర్ పోగానే పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులతో రాజకీయం చేయడం తగదని వార్నింగ్ ఇచ్చారు. 10 సంవత్సరాలు పవర్‌లో ఉండి, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను సతాయించారని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వక, ఇచ్చిన వాటిలో లీకులు, వంటివి చేస్తూ నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు.

గతంలో టీఎస్ పీఎస్సీ తప్పిదాలతో ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లికను కూడా కేటీఆర్ అవమానపరిచాడని అన్నారు. గ్రూప్ 1 లీకేజీ సమయంలో కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాల భర్తీ తప్పకుండా ఉంటాయని తెలిపారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ సమయంలో ఎలాంటి సమస్యలు లేకుండా పకడ్భందీగా నియామకాలు చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. నిరుద్యోగులను రెచ్చకొడితే ఊరుకోబోమని దయాకర్ వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version