Delhi liquor case:ఎమ్మెల్సీ కవితకి మరో షాక్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణ మే 24కు వాయిదా పడింది.

అయితే ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు. కాగా, తాజాగా గురువారం బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ హై కోర్టు మే 24కు వాయిదా వేసింది. దీంతో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. ఇటీవల కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version