రాజస్థాన్ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. సచిన్ పైలట్ జంప్ ?

-

గత వారం రోజుల నుండి రాజస్థాన్ రాష్ట్రము వార్తల్లో ఉంది.. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలే ఇందుకు కారణం అని చెప్పాలి. ఈ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ కు పిడుగులాంటి వార్త పడింది అని చెప్పాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పార్టీనే వీడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతే కాకుండా ఈయన ఏ పార్టీలోకి వెళ్లడం లేదట.. తన తండ్రి వర్ధంతి జూన్ 11 వ తేదీన తానే కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా చాలా కాలంగా సీఎం కు ఇతనికి మధ్యన విబేధాలు తారాస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అధిష్టానం కల్పించుకుని కాంప్రమైజ్ చేయాలని చూసినా కుదరలేదు.

ఇక చేసేది ఏమీ లేక సచిన్ పైలట్ తన కార్యకర్తలు మరియు మద్దతుదారులతో సంప్రదించి ఈ సంచలనం నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news