ధనుష్ “తిరు” ట్రైలర్ రిలీజ్

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ధనుష్. తాజాగా మరో తమిళ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధనుష్ నటించిన లేటెస్ట్ తమిళ మూవీ “తిరు చిత్రాంబళం”. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ని మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యమీనన్, ప్రియా భవాని శంకర్, రాశిఖన్నా నటిస్తున్నారు.

ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా.. ఓంకార్ సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ ప్రసన్న జీకే. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో తిరు ని అందరూ పండు అని పిలుస్తుంటారు. ఈ సినిమాలో ధనుష్ ఓ డెలివరీ బాయ్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 18న తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news