ధోనీ చేసిన ప‌నికి ఫ్యాన్స్ ఫిదా.. వైర‌ల్ వీడియో..!

-

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ మ‌రోసారి త‌న అభిమానుల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నాడు. సెప్టెంబ‌ర్ 19 నుంచి జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ కోసం సీఎస్‌కే టీం ఇప్ప‌టికే చెన్నై నుంచి దుబాయ్‌కి వెళ్లిన విష‌యం విదిత‌మే. అక్క‌డ ఆ టీం ప్రాక్టీస్ కూడా మొద‌లు పెట్టింది. అయితే చెన్నై నుంచి దుబాయ్‌కి వెళ్తున్న క్ర‌మంలో విమానంలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

dhoni once again won fans hearts viral video

సీఎస్‌కే టీం స‌భ్యులు, సిబ్బంది చెన్నై నుంచి దుబాయ్‌కి విమానంలో బ‌య‌ల్దేర‌గా.. అందులో ఎకాన‌మీ క్లాస్‌లో కూర్చున్న ఓ వ్య‌క్తి త‌న కాళ్లు బాగా పొడ‌వుగా ఉండ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నాడు. దీంతో ధోనీ అత‌నికి త‌న బిజినెస్ క్లాస్ సీట్ ఇచ్చి తాను అత‌ని ఎకాన‌మీ క్లాస్ సీట్‌లో కూర్చున్నాడు. త‌రువాత త‌న జ‌ట్టు స‌భ్యుడు సురేష్ రైనా, ఇత‌రుల‌తో ధోనీ ముచ్చ‌టించాడు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అయితే నిజానికి ధోనీ మైదానంలోనే కాదు.. బ‌య‌ట కూడా చాలా కూల్‌గా ఉంటాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగా ఉండాల‌నే త‌త్వాన్ని చాటుతాడు. అందుక‌నే ధోనీకి పెద్ద సంఖ్య‌లో ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. ఇక వారు తాజాగా ధోనీ చేసిన ప‌నికి ఫిదా అవుతున్నారు. కాగా ధోనీ సార‌థ్యంలోని సీఎస్‌కే జ‌ట్టు ఇప్ప‌టికే 3 ఐపీఎల్ టైటిల్స్ ను గెలుచుకోగా.. ఈసారి కూడా టైటిల్‌ను గెలుచుకోవాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news